Haritha Haaram | రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక హరితహారం కార్యక్రమం.. తెలంగాణకు మరో హరిత విజయ ఘనతను తెచ్చిపెట్టింది. తెలంగాణ పచ్చదనంలో పరిఢవిల్లాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ నిరంతర కృషితో తెలంగాణలో పచ్చదనం వెల్లివిరిస్తోంది.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ఓ బుక్ను విడుదల చేసింది. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ విడుదల చేసిన తాజా పుస్తకంలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. 7,213 పాయింట్లతో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. పెరిగిన అడవుల శాతం, మున్సిపల్ వేస్ట్ మేనేజ్మెంట్లో తెలంగాణ టాప్ ర్యాంకులో నిలిచింది.
సీఎస్ఈ పుస్తకంలో తెలంగాణ నంబర్ వన్గా నిలవడంపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతకు, హరితహారం విజయానికి ఇది మరో నిదర్శనం అని కేటీఆర్ పేర్కొన్నారు.
Great news for Telangana 😊
On the eve of the world environmental day, the latest book released by Centre for Science and Environment (CSE) Telangana state stands a clear Number One among all indian states 👏
Kudos to visionary leadership of CM KCR Garu and his brainchild… pic.twitter.com/02SSU6rvEm
— KTR (@KTRBRS) June 4, 2023