చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఓ అమ్మాయికి రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అండగా నిలిచి, ఆమెను ఉన్నత విద్యావంతురాలిగా తీర్చిదిద్దారు. ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేసుకున్న ఆ యువతి ఏకంగా ఐదు బహుళజాతి కంపెనీల్లో జాబ్ ఆఫర్ను కొట్టేసింది. ఈ సందర్భంగా ఆమె విజయ ప్రస్థానాన్ని నమస్తే తెలంగాణ దినపత్రిక మంగళవారం ప్రచురించింది. ఈ క్లిప్ను మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ పేజీ షేర్ చేశారు. ఈ వార్త నా మనసుకు హత్తుకుంది. ఎంతో ఉజ్వలమైన భవిష్యత్ ఉన్న విద్యార్థిని రచన.. మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించబోతోందని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
జగిత్యాల జిల్లా రాయికల్కు చెందిన రుద్ర భూమేశ్వర్ – మమతల కూతురు రచన. చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో జగిత్యాలలో బాలల సదనంలో పదో తరగతి వరకు చదివింది. అప్పటి కలెక్టర్ శరత్ సహకారంతో హైదరాబాద్లోని యూసుఫ్గూడలో డిప్లొమా చదివి ఈ-సెట్లో మంచి ర్యాంక్ సాధించింది. అక్కడి నుంచి వచ్చి కథలాపూర్ మండలం తాండ్య్రాలలోని తన అక్క రమ్య ఇంట్లో రచన ఉంటున్నది. రచన ఈసెట్లో మంచి ర్యాంక్ సాధించిన విషయాన్ని ఆమె బావ శేఖర్ ట్విట్టర్లో పోస్టు చేయగా మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించారు. రచనను దత్తత తీసుకొని తన సొంత డబ్బుతో బీటెక్ చదివించారు. పట్టుదలతో కష్టపడి చదివిన రచన.. ఐదు బహుళజాతి కంపెనీల నుంచి జాబ్ ఆఫర్ లెటర్లు అందుకున్నది. కానీ, తాను ఉద్యోగంలో చేరబోనని, తన తల్లి కోరిక మేరకు కలెక్టర్ అవుతానని రచన ధీమా వ్యక్తంచేసింది. ఈ సందర్భంగా రుద్ర రచనను సోమవారం జగిత్యాల జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత, ఎమ్మెల్యే సంజయ్కుమార్, మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి శాలువాతో సన్మానించి అభినందించారు.
This news warmed my heart & made my day 😊
This bright young girl Rachana is going to soar to much greater heights 👍 pic.twitter.com/VFjRtWCkwq
— KTR (@KTRTRS) July 26, 2022