హైదరాబాద్ : రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అధికారులకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ఈ విద్యా సంవత్సరం సర్కారు బడుల్లో నమోదు సంఖ్య రెట్టింపు అయిందని కేటీఆర్ పేర్కొన్నారు. విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఫలితాలను ఇస్తున్నాయని కేటీఆర్ చెప్పారు. ఈ విషయం ఎంతో ఆనందాన్ని ఇస్తుందన్నారు.
మన ఊరు – మన బడి, ఇంగ్లీష్ మీడియం చదువులతో ఈ ఏడాది వేలమంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లను వదిలి సర్కారు బడి బాట పట్టారు. ఇప్పటివరకు 61,129 మంది విద్యార్థులు ప్రైవేట్ను వీడి సర్కారు స్కూళ్లల్లో చేరారు. మొత్తంగా ఈ సంవత్సరం 1,69,280 మంది విద్యార్థులు కొత్తగా అడ్మిషన్లు పొందారని అధికారులు తెలిపారు. సర్కారు బడుల్లో నమోదును పెంచడమే లక్ష్యంగా చేపట్టిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం గురువారంతో ముగిసింది. ఏటా 6 -10 రోజులు మాత్రమే బడిబాట నిర్వహించగా, ఈ ఏడాది నెలపాటు నిర్వహించారు. బడిబాట కార్యక్రమం ముగిసినా సెప్టెంబర్ వరకు అడ్మిషన్లు తీసుకొంటామని అధికారులు తెలిపారు. సర్కారు బడుల్లో చేరాలనుకొనేవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు.
Glad that #Telangana Govt’s efforts to improve education standards have started showing results
Enrolment has gone up manifold this academic year all over the state. My compliments to Education Minister @SabithaindraTRS Garu and her team 👍 pic.twitter.com/zhKR9G6HOq
— KTR (@KTRTRS) July 1, 2022