హైదరాబాద్ : ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బిజీగా గడుపుతున్నారు. ఇవాళ ఢిల్లీలో బోయింగ్ సంస్థ చీఫ్ స్ట్రాటజీ అధికారి మార్క్ అలెన్, బోయింగ్ ఇండియా అధ్యక్షులు సలీల్ గుప్తాతో కేటీఆర్ సమావేశమై రాష్ట్రంలో బోయింగ్ సంస్థ ఉత్పత్తులతో పాటు భవిష్యత్తులో ఇక్కడ వ్యాపారాభివృద్ధికి ఉన్న అవకాశాల గురించి చర్చించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ ట్వీట్ చేశారు. 2015లో మార్క్తో తాను అమెరికాలో మొదటిసారి కలిసినట్లు, అప్పటినుంచి వివిధ సందర్భాల్లో ఆయనతో సమావేశమైనట్లు ఈ సందర్భంగా కేటీఆర్ వెల్లడించారు. హైదరాబాద్లో బోయింగ్ తయారీ యూనిట్ ఏర్పాటులో మార్క్ ఎంతగానో సహాయపడినట్లు కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
Had a great meeting with Marc Allen, Chief Strategy Officer & SVP of Boeing and Salil Gupte, President of Boeing India
Marc & I had met initially in 2015 in the US & stayed in touch since. Marc was instrumental in helping Boeing setup manufacturing in India at Hyderabad pic.twitter.com/HXFdaG78X4
— KTR (@KTRTRS) June 9, 2022