హైదరాబాద్: కంటోన్మెంట్లోనూ ఉచిత మంచినీటి పథకం అమలు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంటును అభివృద్ధి చేస్తుండగా, కేంద్రం అడ్డుకుంటున్నది ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్లో పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శ్రీకారం చుట్టారు. సనత్నగర్ నియోజకవర్గంలోని రసూల్పురాలో నాలా అభివృద్ధి పనులకు, పాటిగడ్డలో మోడ్రన్ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్కు మంత్రి శ్రీనివాస్ యాదవ్తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. కేంద్రప్రభుత్వం పేదలకు పట్టాలు ఇవ్వడంలేదని చెప్పారు. రోడ్లు వేస్తామంటే స్థలం ఇవ్వడం లేదని విమర్శించారు. కంటోన్మెంట్లో రోడ్లను మూసేయడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ అభివృద్ధి చెందుతున్నదని వెల్లడించారు. నగరంలో ప్రశాంత వాతావరణం ఉన్నదని తెలిపారు. కుల మతాలతో సంబంధం లేకుండా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కోసం పది లక్షల మంది ఆగబిడ్డలకోసం రూ.8421 కోట్లు ప్రభుత్వం వెచ్చించిందన్నారు. పాటిగడ్డ ఫంక్షన్ హాల్ను వచ్చే దసరాకి ప్రారంభించుకుందామని చెప్పారు.