బీఆర్ఎస్ కారు స్టీరింగ్ ముమ్మాటికి మా చేతుల్లోనే ఉన్నది. కానీ, ప్రధాని మోదీ, బీజేపీ స్టీరింగ్ మాత్రం ముమ్మాటికి అదానీ చేతిలో ఉన్నదని గుర్తిస్తే మంచిది. సెప్టెంబర్ 17ను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన విషయాన్ని అమిత్షాకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి చెప్పకుండా దాచి ఉంచారేమో! అమిత్షా తన వ్యాఖ్యలను సరిదిద్దుకోవాలి.
-మంత్రి కేటీఆర్
హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): కేంద్ర హోంమంత్రి అమిత్షా ఎన్ని అబద్ధాలు చెప్పినా బీజేపీకి తెలంగాణ ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు హెచ్చరించారు. డబుల్ ఇంజిన్ ప్రభు త్వం గురించి మాట్లాడుతున్న అమిత్షాకు దమ్ముంటే పదేండ్లలో తెలంగాణ కంటే గొప్పగా అభివృద్ధి చెందిన ఒక రాష్ట్రాన్ని చూపించాలని సవాల్ విసిరారు. రాష్ట్ర తలసరి ఆదాయం, తలసరి విద్యుత్తు వినియోగం ఇలా అన్ని రంగాల్లో తెలంగాణ సమగ్రంగా అభివృద్ధి చెందిందని వివరించారు. బీజేపీ పాలిత ఒక్క రాష్ట్రమైనా తెలంగాణతో పోటీపడగలదా? అని సవాల్ విసిరారు. దమ్ముంటే తన సవాల్ను స్వీకరించాలన్నారు.
ఆదిలాబాద్ పర్యటనలో అమిత్షా వల్లెవేసిన అబద్ధాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని మంగళవారం ఒక ప్రకటనలో ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి బీజేపీ ఒకటంటే ఒక మంచి పని కూడా చేయలేదని విమర్శించారు. ఎన్నికల వేళ చేసే బీజేపీ జూమ్లాలు, అబద్ధాలను వినీవినీ ప్ర జలు విసిగిపోయారన్నారని, వారి మాటలను నమ్మే పరిస్థితి లేదని పేర్కొన్నారు. అమిత్షాకు దమ్ముంటే అదానీ గురించి మాట్లాడాలని డిమాండ్ చేశారు. మోదీ, అమిత్షా 100 సార్లు అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. వారి అబద్ధాలకు తెలంగాణ ప్రజలు ప్రభావితమయ్యే అవకాశం లేదని అన్నారు. బీజేపీకి రాష్ట్రంలో 110 నియోజకవర్గాల్లో డిపాజిట్లు దక్కవని చెప్పారు.
రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నదంటూ అమిత్షా పచ్చి అబద్ధం చెప్పి ప్రజలను మోసగించే ప్రయత్నం చేశారని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం విప్లవాత్మకమైన రైతు సంక్షేమ కార్యక్రమాలతో వ్యవసాయ అభివృద్ధి, రైతు సంక్షేమంలో దేశానికి ఆదర్శంగా నిలిచిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. తెలంగాణ స్ఫూర్తిగా రైతుబంధు కార్యక్రమాన్ని కాపీ కొట్టిన మోదీ, అమిత్షా తెలంగాణ గడ్డ నుంచి అబద్ధాలు ఆడారని ఎద్దేవా చేశారు.
ఆదిలాబాద్ జిల్లాలో మూతపడిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)ను తెరిపిస్తామంటూ ఐదేండ్ల క్రితమే అమిత్షా హామీ ఇచ్చి నా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని కేటీఆర్ పేర్కొన్నారు. ఇలాంటి నాయకులు కేంద్ర ప్రభుత్వంలో ఉండటం తెలంగాణ రాష్ట్ర దురదృష్టమని చెప్పారు. రాష్ట్రం ఏర్పడి పదేండ్లవుతన్నా చట్టప్రకారం దకాల్సిన ఒక విద్యాసంస్థను కూడా కేటాయించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వాన్ని తప్పు పట్టడం వారి ద్వంద్వనీతికి అద్దం పడుతున్నదని ధ్వజమెత్తారు. సంవత్సరాల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం స్థలం అప్పజెప్పినా ఇప్పటిదాకా గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయలేదని దుయ్యబట్టారు. అమిత్షాకు, బీజేపీకి దమ్ముంటే తెలంగాణకు గత పదేండ్లలో ఏమి చేశారో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
కుటుంబ పాలనపై అమిత్షా మాట్లాడితే దేశ ప్రజలు నవ్వుకుంటున్నారు. ప్రపంచ క్రికెట్ వరల్డ్కప్ జరుగుతున్న సందర్భంలో అమిత్షా కొడుకు జైషా ఎకడ క్రికెట్ ఆడారో, ఎకడ ఎవరికి కోచింగ్ ఇచ్చారో చెప్పాలి. ఎలాంటి అర్హతలు లేకున్నా బీసీసీఐ సెక్రటరీగా కొనసాగుతున్న కొడుకు విషయంలో ఉన్న పరివార్వాద లబ్ధి గురించి అమిత్షా మాట్లాడితే మంచిది. అమిత్షా లాంటి నాయకులు మాట్లాడితే ప్రజలు పరిహసిస్తారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఆశీస్సులతో గెలుస్తున్న ప్రజామోద పాలనను కుటుంబపాలన పేరుతో ప్రశ్నించే నైతికహక్కు అమిత్షాకు లేదు.
-మంత్రి కేటీఆర్