నేరేడ్మెట్, మే 24: ఇటీవల దావోస్ పర్యటనలో భాగంగా సోమవారం లైఫ్ సైన్సెస్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ను ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ యూకే వైస్ చైర్మన్ సిక్కా చంద్రశేఖర్ గౌడ్ కలిశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో నైపుణ్యానికి కొదవలేదని, ప్రభుత్వం లైఫ్ సైన్సెస్ రంగంలో పరిశోధన, అభివృద్ధి ఆవిష్కరణలకు ప్రాధాన్యమిస్తూ ఆ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామిక వేత్తలు, ప్రధానమైన సంస్థలను కోరినట్టు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో ఆదిత్య థాక్రే, పోచారం సురేందర్రెడ్డి ఉన్నారు.