రాజన్న సిరిసిల్ల : సిరిసిల్ల నియోజకవర్గంలో రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవం చేశారు. గంభీరావుపేట మండలం దమ్మన్నపేటలో ఎస్డీఎఫ్, ఈజీఎస్ నిధులు రూ.33లక్షలతో నిర్మించిన గ్రామీణ ప్రగతి ప్రాంగణం, రూ.22లక్షల నిర్మించిన రైతువేదిక, సీడీఎఫ్ నిధులు రూ.15లక్షలతో నిర్మించిన రెడ్డి సంఘ భవనాలకు ప్రారంభోత్సవం చేశారు. రూ.5లక్షలతో నిర్మించనున్న డ్రైనేజీ పనులకు భూమిపూజ చేశారు. అలాగే దమ్మన్నపేటలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాన్ని కేటీఆర్ ప్రారంభించారు.