హైదరాబాద్, మార్చి 9 : ఉన్న త విద్యాసంస్థల్లో సీట్లు సంపాదించినా పేదరికం కారణంగా చదువు ఆగిపోయే పరిస్థితిలో ఉన్న ఇద్దరు విద్యార్థులకు ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అండగా నిలిచా రు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలం తుమ్మల పెన్పహాడ్కు చెందిన పారిశుద్ధ్య కార్మికుడు పిడమర్తి ప్రసాద్ కొడుకు అనిల్కుమార్కు ఐఐటీ ఖరగ్పూర్లో ఐప్లెడ్ జియాలజీలో ఇంజినీరింగ్ సీటు వచ్చింది. ఆర్థిక పరిస్థితి వల్ల చదువు కొనసాగించడం కష్టంగా మారింది. విషయం తెలుసుకొన్న మంత్రి కేటీఆర్ బుధవారం వారిని ప్రగతి భవన్కు పిలిపించారు. అనిల్ చదువుకు ఆర్థిక సాయం అందించారు. చదువు పూర్తయ్యాక అమ్మానాన్నలను మంచిగా చూసుకోవాలని, ఇతరులకు సాయపడాలని సూచించారు. అదేవిధంగా మహబూబ్నగర్ మండలం గాజులపేటకు చెం దిన ఆటో డ్రైవర్ గోపాల్రెడ్డి కొడుకు ప్రశాంత్రెడ్డి ఇటీవల జరిగిన నీట్లో జాతీయ స్థాయిలో 723వ ర్యాం కు సాధించి సూర్యాపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు పొందాడు. చదువుకయ్యే ఖర్చులకు డబ్బులు లేకపోవడంతో సాయం కోరుతూ మంత్రి కేటీఆర్కు ట్వీట్ చేశాడు. స్పందించిన మంత్రి.. ప్రశాం త్రెడ్డిని పిలిపించుకొని ఆర్థికసాయం అందించారు. కష్టాల్లో ఉన్న తమను పిలిచిమరీ సాయం అందించినందుకు ఆ విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.