హైదరాబాద్ : ఉప్పల్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హుటాహుటిన సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి చేరుకున్నారు. సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురికావడంతో వైద్య పరీక్షల నిమిత్తం ఆయన యశోద ఆస్పత్రికి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న కేటీఆర్.. ఉప్పల్ నుంచి నేరుగా యశోద ఆస్పత్రికి వచ్చారు. కేసీఆర్కు సిటీ స్కాన్, యాంజియోగ్రామ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు వైద్యులు. కేసీఆర్ వెంట ఆయన సతీమణి శోభ, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్ కుమార్ ఉన్నారు.