KTR | హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఐదోసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. ఈ క్రమంలో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేసేందుకు హైదరాబాద్ నుంచి సిరిసిల్లకు బయల్దేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ ప్రగతి భవన్లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సీఎం కేసీఆర్, తల్లి శోభమ్మ ఆశీర్వాదం తీసుకుని సిరిసిల్లకు బయల్దేరారు. సిరిసిల్ల ఆర్డీవో కార్యాలయంలో ఉదయం 11:45 గంటలకు కేటీఆర్ తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించనున్నారు. అనంతరం ఆర్మూర్, కొడంగల్ నియోజకవర్గాల్లో కేటీఆర్ రోడ్షోల్లో పాల్గొననున్నారు.