Minister KTR | కరీంనగర్ ఎంపీగా నాలుగేళ్లలో ఏం పీకినవని నిలదీయాలని విద్యార్థులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో కాన్వాయ్కి అడ్డుగా ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుగా వచ్చి నినాదాలు నినాదాలు చేశారు. ఈ విషయంలో ఆత్మీయ సభలో ఏబీవీపీ కార్యకర్తలనుద్దేశించి మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ఎక్కడి సిరిసిల్ల ఎక్కడికి వచ్చింది? విద్యావ్యవస్థలో ఇలా అవుతుందని ఎవరైనా అనుకున్నారా? సిరిసిల్ల మెడికల్ కాలేజీ ప్రారంభమవుతుందని అనుకున్నామా?
మరి విద్యార్థులు అడ్డం వచ్చి లొల్లి పెట్టవచ్చునా? జిల్లాకో మెడికల్ కాలేజీ ఇచ్చిన కేసీఆర్ ఎక్కడా? తెలంగాణ రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వని దౌర్భాగ్యపు ప్రధాని ఎక్కడా? ఆయనతో మనకు పోలికనా..? ఒక్క మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, నవోదయ పాఠశాల, కస్తూర్బా ఇవ్వలే. పోయినసారి కరీంనగర్కు ట్రిపుల్ ఐటీ వచ్చినట్టే వచ్చి ఎత్తిపోయింది. విద్యార్థులు ఎవరిపై కొట్లాడాలి? మనం ఏం చేస్తున్నామో కొద్దిగా సోయి ఉండాలి. ఇన్ని చేసిన ప్రభుత్వంపైకి.. వ్యవసాయ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ పెట్టి.. బ్రహ్మాండంగా జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీలు తెస్తే నలుగురు పిల్లలను ఉసిగొల్పి అడ్డం పంపడం న్యాయమా? ఇది సరైందేనా? విద్యావ్యవస్థలో ఎక్కడ ఉండే సిరిసిల్ల ఎక్కడికి వెళ్లిందో ఆలోచన చేయొద్దా? వట్టిగనే ఆగమైపోదామా? దమ్ముంటే నరేంద్ర మోదీ, బండి సంజయ్పై దాడి చేయాలి’ అన్నారు.
‘నాలుగేళ్ల అయ్యింది ఎంపీ అయ్యి మరి ఏం పీకనవ్ అని గల్లా పట్టి నిలదీసి అడగాలి. ఇజ్జత్, మానం ఉంటే ఏం చేసినవో చెప్పు అంటే ఏం తెల్వది. మీదికి అడ్డం పొడువు మాట్లాడుతడు. బాధ ఎందుకు అనిపిస్తుందంటే.. ‘ఇది నిన్న పేపర్. నేను వాలాయించి తెచ్చుకున్న. ఈ పేపర్లలో ఏం రాశారో ఎరుకేనా? టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేటీఆర్ పనే. ఆయన రాజీనామా ఎట్ల చేయడో చూస్తా. ఇంకా దారుణం ఏంటంటే.. ముఖ్యమంత్రిని పట్టుకొని బ్రోకర్ అంటున్నడు. నాకు అనరాదా? నీ ప్రధానమంత్రి అదానీకి బ్రోకర్ అని నేను అనలేనా? మీ ప్రధాని నరేంద్ర మోదీ ఓ బ్రోకర్ అని అనలేనా? కానీ.. నేను అన. మాకు సంస్కారం ఉంది కాబట్టి నేను అన. దేశమంతా అంటుంటి నేను అన. మాకు చేత కాదా? మాకు మాటలు రావా? నేను సిరిసిల్లకు మెడికల్ కాలేజీ, ఇంజినీరింగ్ కాలేజీ, వ్యవసాయ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ తీసుకువచ్చినా.
నువ్వు తెచ్చిన బుడ్డ పాఠశాలనైనా చూపిస్తావా? మా నేతన్నలకు సిరిసిల్లలో వేలకోట్ల ఆర్డర్లు బతుకమ్మ చీరెలకు నేను. ఆర్వీఎం ఆర్డర్లు తెచ్చింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి. మరి నువ్వు చూపిస్తావా? నేతన్నలకు చేసిన పని. నువ్వు చేసింది ఏమైనా ఉందా? ఇక్కడ అపెరల్ పార్క్ ఉన్నది. కొత్తగా కడుతున్నమ్ వర్కర్ టూ ఓనర్.. రూ.400కోట్లతో 1100 మందిని ఓనర్లు చేయబోతున్నాం. నిన్నే మొన్న అడ్డమైనా ఆరోపణలు చేశాడు. నేను నవ్వాలా? ఏడ్వాలా? ఆయన తెలికి. రేవేంత్రెడ్డి, బండి సంజయ్ ఇంకా అందరి మాటలు వింటే నాకైతే ఒకటే అనిపించింది. జీవితంలో వీరంతా ఒక్క పరీక్షనైనా రాశారో లేదో నాకైతే డౌటే. వీళ్లకు చదుకున్నడా? రేవంత్ డిగ్రీ ఏందో ఎవరికైనా తెలుసా? నిజామాబాద్ ఆయనది ఫేక్ డిగ్రీ. రాజస్థాన్లో దొంగ డిగ్రీ పెట్టి దొరికిపోయిండు. ఇక్కడ ఆయన ఇట్లున్నడు. కిషన్రెడ్డేమో.. ఆయన గురించి చెబితే బాగుండదు. కుర్కురే ప్యాకెట్లు పంచుతడు కోవిడ్లో. ఇజ్జత్ మానం ఉన్నోళ్లేనా? పురాగ ఇడిసిపెట్టినోళ్లు అనాల్నా’ అంటూ చురకలంటించారు.
‘సీతాఫల్మండి రైల్వేస్టేషన్లో ప్యాసింజర్ లిఫ్ట్ ప్రారంభించి.. దాని కింద జాతికి అంకితం చేసిన కిషన్రెడ్డి అని రాసుకున్నరు. కేసీఆర్ ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టారు. నేను కూడా ఏదైనా చేయాలని కిషన్రెడ్డి సీతాఫల్ మండి రైల్వేస్టేషన్లో రెండు లిఫ్ట్లు పెట్టించారు. ఇదీ వీళ్ల పనితీరు. ఒక స్కూల్తేను చేత కాదు. ఓ గుడి కట్టే చేత కాదు. ఏ వర్గానికి సహాయం చేసే చేత కాదు. ఇంకా పైనుంచి మాటలు. తొమ్మిదేళ్లలో ఒక శత్రుదేశాన్ని చూసినట్లు, పొరుగు దేశాన్ని చూసినట్లు పగపట్టి తెలంగాణ పుట్టుకనే అవమానించిన వ్యక్తి నరేంద్ర మోదీ కాదా? తల్లిని చంపింది అన్నది ఈ దౌర్భాగ్యపు ప్రధానమంత్రి కాదా? నేను అనేది తప్ప? పార్లమెంట్లోనే అన్నడు.
ఇక్కడ వెయ్యి మంది చనిపోయింది నీకు సోయి లేదు. శ్రీకాంతచారి ఆత్మబలిదానం గురించి అవగాహన లేదు. ఇవాళ నువ్వు వచ్చి తల్లిని చంపి బిడ్డను బతికించారు అంటే మేం పడి ఉండాలా? గుజరాత్ చెప్పులు మోసే బండి సంజయ్లాంటి సన్నాసులు ఈ రాష్ట్రంలో పుట్టడం మన దురదృష్టం. వినోద్కుమార్లాంటి ఓడించి సన్నాసిని తెచ్చిపెట్టుకున్న కరీంనగర్ పార్లమెంట్ ప్రజలు. ఇందులో వేములవాడ వాళ్ల తప్పుకూడా ఉన్నది. పోయినసారి మెజారిటీ ఇవ్వలేదు. కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో సిరిసిల్ల జిల్లా మెజారిటీతోనే వినోద్కుమార్ మళ్లీ పార్లమెంట్కు వెళ్లాలి. దానికి మనందరం గట్టిగా పట్టుపట్టి ముందుకెళ్లాలి. ఈ సన్నాసిని ఇంట్లో కూర్చుండబెట్టాలి’ అని పిలుపునిచ్చారు.