Haritha Haram | హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): హరితహారం కార్యక్రమంతో రాష్ట్రమంతా పచ్చదనం పరుచుకున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. తొమ్మిదేండ్లలో 7.07 శాతం గ్రీన్ కవర్ పెంచినట్టు తెలిపారు. ఆదివారం అసెంబ్లీలో సీఎం మాట్లాడు తూ.. ‘మాట్లాడితే ఇంగీత జ్ఞానం ఉండాలి. కాంగ్రెసోళ్లు హరితహారాన్ని కూడా విమర్శించిన్రు. హరితహారం ఎంతటి అద్భుత పథకం? ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలోనే అద్భుతమైన అడవులన్నీ నరికివేశారు. మీ సాక్షిగనే. మీ పరిపాలనలోనే దట్టమైన అడవులు ఎందుకు మాయమైనయి. మా హయాంలో ఆఫీసర్లు, కలెక్టర్లను ఇన్వాల్వ్ చేసి, గ్రీన్ఫండ్ యాక్ట్ తెచ్చి, గ్రామపంచాయతీలు, అన్ని స్థా నిక సంస్థలకు 10 శాతం గ్రీన్కవర్ తప్పనిసరి చేసి, గ్రీన్బడ్జెట్ ఏర్పాటు చేసి, ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా గ్రీన్ఫండ్ను ఏర్పాటుచేసి, ఐఏఎస్, ఐపీఎస్, ఎమ్మెల్యేలు, ఎంపీల వద్ద నుంచి నెలకు రూ. వంద, విద్యార్థుల నుంచి రూ.5 పెట్టినం. హరితహారంలో ఈ 9 ఏండ్లల్లో 7.07 శాతం గ్రీన్కవర్ పెం చినం. 273 కోట్ల మొక్కలు నాటినం. మున్నిపాలిటీలు, పట్టణాలకు పోయినా స్వాగతం పలుకుతున్నయి. అద్భుతంగా హైదరాబాద్కు గ్రీన్సిటీ అవా ర్డు వచ్చింది. ఈ మధ్యే…‘దారులన్నీ.. పూలతేరులైనయని’ కామారెడ్డి జిల్లా కవి రాశారు. వారికి ధన్యవాదాలు తెలుపుతున్నా.
కంటివెలుగు గ్రాండ్ సక్సెస్
వైద్యం అనగానే సూది, మందు, డాక్టర్లు మాత్ర మే కాదు. వైద్యం అంటే ఏ గవర్నమెంట్ కన్సర్న్ ఆఫ్ ది పీపుల్ ఇన్ దిస్ సెక్టార్. దవాఖాన్లు కట్టగానే కాదు.. మీకు ఎంత కన్సర్న్ ఉన్నది అన్నదే, ఏం చేయాలనుకుంటున్నరు అన్నదే ముఖ్యం. ఈ దృష్టికోణంలోనే మేం వైద్యరంగాన్ని ఆవిష్కరించినం. యావన్మంది ప్రజలకు కంటివెలుగు పెట్టి ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహిస్తారని? ఎవరన్న ఇండియాలో ఊహించిన్రా.. ఘనత వహించిన కాంగ్రెస్ పాలనలో ఎవరి బుర్రకన్నా ఇట్లాంటి ఆలోచన తట్టిందా? లయన్స్ క్లబ్ వాళ్లో, మరెవరో కంటిశిబిరాలు పెట్టేవాళ్లు. పంజాబ్, ఢిల్లీ సీఎంలు వచ్చి ఖమ్మం జిల్లాలో కంటివెలుగును చూసి ఆశ్చర్యపో యి మేమూ మా రాష్ట్రంలో అమలుచేస్తామని ప్రకటించిండ్రు. కేసీఆర్ కిట్.. అమ్మ ఒడి వాహనాలు. ఏకాణ ఖర్చులేకుండా వాళ్లను ఇంటికి చేర్చుతున్నా యి. కేసీఆర్ కిట్లోని వస్తువులే కాదు.. రూ.12-13 వేలు ఇస్తున్నం. ఇది కన్సర్న్ ఆఫ్ ది గవర్నమెంట్. సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లు వస్తున్నయి. వైద్యరంగంలో ఏ విధంగా చేస్తున్నమో అంతా ప్రజలకు తెలుసు.
కాంగ్రెస్ కాలంలో అమాంబాపతు
విద్య విషయంలో ఎంతో చేసినం. గురుకులాలు దేశంలో ఎక్కడాలేవు. ఇవి పాఠశాలలు కావు. కాలేజీలు. అన్నింటికన్నీ జూనియర్ కాలేజీలు చేసినం. గతంలో ఇంత మొత్తంలో గురుకులాలు లేవు. కాం గ్రెస్ కాలంలో మైనార్టీ, ఎస్టీ అన్ని కలిపి 260-270 వరకు ఉండే. ఆ కాలంలో అమాంబాపతు గురుకుల పాఠశాలలుండేవి. డబ్బులు ఇవ్వకపోదురు. ముక్కిపోయిన.. పురుగులు పట్టిన బియ్యం పెట్టేవారు. మేం ఒక విద్యార్థి మీద 1.20 లక్షలు వెచ్చిస్తూ, వేల కోట్లు ఖర్చు చేస్తూ గురుకుల కాలేజీలను నడుపుతున్నం. 2014కు ముందు జూనియర్ కాలేజీలు 443 మాత్రమే. ఈ రోజు ప్రభుత్వ, గురుకుల కాలేజీలు కలిపి 1,372 తెచ్చినం. విత్ ఇన్ ది షార్ట్ స్పాన్ ఆఫ్ నైన్ అండ్ ఆఫ్ ఇయర్స్. ఇవన్నీ రెసిడెన్షియల్ కాలేజీలు. అన్నీ కలిపితే 1,775 సర్కారు కాలేజీలు కొలువు దీరినయి. వీటి ల్లో 3.66 లక్షల విద్యార్థులు చదువుకుంటున్నరు. చదువుకోవడమే కాదు.. నీట్, ఎంసెట్లలో అద్భుత ర్యాంకులు సాధిస్తున్నరు. రూ.20 లక్షల ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే. ఎక్కడా ఎవ్వరూ ఇవ్వడంలేదు.
మజ్లిస్, మేం ఫ్రెండ్లీ పార్టీ
మేం డైరెక్ట్గా సెక్యులర్ పార్టీగా ప్రకటించుకున్నం. వేరే రాష్ర్టాలకు మేం పోయినా, అసదుద్దీన్ ఒవైసీ పోయినా, మాకు బ్రాండ్ వేస్తరు. మేమట బీజేపీకి బీ టీమ్ అట. ఒకాయన పుణ్యాత్ముడు శరద్పవార్.. ఆయన కూడా మమ్మల్ని బీజేపీకి బీ టీమ్ అన్నడు. మొన్నటికిమొన్న ఆయన్నే పోయి సక్కగ బీజేపీ సం కల సొచ్చిండు. బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రల అడుగుపెట్టంగనే మీకు వణుకుడు పుట్టి బీ టీం అని బ్రాం డేస్తరు. ఎవరెన్ని మాట్లాడిన మజ్లిస్, మేం ఫ్రెండ్లీ పార్టీ అని డిక్లేర్ చేసుకున్నం. ఇప్పుడు ఫ్రెండ్లీ పార్టీగా ఉన్నం. భవిష్యత్తులో ఫ్రెండ్లీ పార్టీగా ఉంటం.
బీడీ టేకేదారులకు పింఛన్లు ఇవ్వలే
కాంగ్రెస్ అన్నీ చేసిందన్నట్టుగా భట్టి విక్రమార్క ఒంటికాలిమీద లేస్తరు. వారి గొప్ప పాలనలో వారిచ్చిన పింఛన్ రూ.200. మేమిచ్చేది రూ.2,000. డిఫరెన్స్ ఇది. దివ్యాంగులకు వాళ్లిచ్చింది రూ.500, మేమిస్తున్నది రూ.4,016. వాళ్ల హయాంలో బీడీకార్మికులు, టేకేదారులకు పింఛన్లులేవు. వీళ్లకు మేమిస్తున్నం. ఒంటరి మహిళలకు వాళ్లు ఇవ్వలే. మేం ఇస్తున్నం. బోధకాలు బాధితులకు పింఛన్ లేదు. మేం ఇస్తున్నం. డయాలసిస్ పేషెంట్లను వాళ్లు పట్టించుకోలే. మేం ఇస్తున్నం.
రాష్ట్రంలో రివొల్యుషన్
సంక్షేమం విషయంలో నాయిబ్రాహ్మణుల సెలూ న్లు, రజకుల లాండ్రీ షాపులను కాంగ్రెస్ ఎన్నడు పట్టించుకోలే. మేం 250 యూనిట్లు ఉచిత విద్యుత్తును ఇస్తున్నాం. రైతన్నలు, నేతన్నలు, గీతన్నలకు రూ.5 లక్షల బీమా కల్పించినం. బలహీనవర్గాల ఇండ్ల బకాయిలను కాంగ్రెస్ హయాంలో ముక్కుపిండి వసూలుచేసేవారు. మేం నాలుగు వేల కోట్లు మాఫీ చేసినం. గొల్లకుర్మ సోదరులకు గొర్రెలు పంపిణీ చేసినం. క్యాటిల్ పాపులేషన్లో నెంబర్ వన్కు వచ్చినం. పింక్ రివొల్యుషన్.. గ్రీన్ రివొల్యుషన్, వైట్ రివొల్యుషన్ తెచ్చినం. పాడి రైతులకు కాంగ్రెస్ ఎన్నడూ ఏకాణ పైసా ఇవ్వలే. మేం శ్రీనివాస్యాదవ్ ఆధ్వర్యంలో లీటర్కు నాలుగు రూపాయల చొప్పున ఇస్తున్నాం.’ అని సీఎం చెప్పారు.
ఏక్ సాల్ కా బడ్జెట్.. కాంగ్రెస్ దస్ సాల్ కా బరాబర్
దళితబంధు ఎవ్వల ఊహల కూడా లేదు. పది లక్షలు డీబీటీ పద్ధతిలో ఇవ్వడం ప్రపంచంలో ఎక్కడా లేదు. భట్టి విక్రమార్క నియోజకవర్గంలోని చింతకాని మండలంలో 100 శాతం పూర్తి చేసినం. ఐదో, పదో మిగిలితే వాటిని కూడా పూర్తి చేస్తం. ఇంకో మండలాన్ని తీసుకుని క్రమంగా ఐదారు మండలాలను సాచురేషన్ పద్ధతిలో పూర్తి చేస్తం. బలహీన వర్గాల్లోని పేదలకు రూ.లక్ష ఇస్తున్నం. మైనార్టీలకు ఒక లక్ష ఇస్తున్నం. ఇది రుణంగా అక్బరుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. ఇది రుణం కాదు. ఇది పూర్తిగా గ్రాంట్. ముస్లింలకు సైతం ఇస్తున్నాం. ఇది మైనార్టీల మీద మాకున్న ప్రేమ. మా కన్నా ముందు పదేండ్లు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలించింది. ఈ పదేండ్లలో మైనార్టీల కోసం రూ.925 కోట్లు బడ్జెట్ కేటాయిస్తే, బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.12 వేల కోట్లు కేటాయించింది. హమారా ఏక్ సాల్ కా బడ్జెట్ కాంగ్రెస్ దస్ సాల్ కా బడ్జెట్ కే బరాబర్ హై.
తండాలు గ్రామపంచాయతీలు అయినయ్
‘తండాలను గ్రామ పంచాయతీలు చేయాలని దశాబ్దాల తరబడి కొట్లాడినా, వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసినా కాంగ్రెస్ ప్రభుత్వాలు పట్టించుకోలే. టీడీపీ ప్రభుత్వమూ పట్టించుకోలే. మేం వచ్చిన తర్వాత ఆదివాసీ, కోయగూడాలను, బంజారా తండాలను 3,700 వరకు గ్రామ పంచాయతీలుగా చేసినం. నిధులు వాళ్లకే ఇచ్చినం. అద్భుతంగా ఈ రోజు ఆ పంచాయతీలు వెలిగిపోతున్నాయి. వాళ్ల తండాలను వారే అభివృద్ధిని చేసుకుంటున్నరు. గిరిజనులకు 10శాతం రిజర్వేషన్ ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే. ఇండియన్ హిస్టరీలో విత్ ఇన్ వన్ జీవో 4.01లక్షల ఎకరాల పోడుభూములకు పట్టాలిచ్చిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. పట్టాలివ్వడమే కాకుండా పాస్బుక్లిచ్చినం. రైతుబంధు కూడా ఇచ్చినం. వాళ్లంతా సంతోషంగా ఉన్నారు’ అని సీఎం కేసీఆర్ చెప్పారు.
దారులు పూలతేరులయి, తావులు నింపును నేత్రశోభలన్ తేరులవోలె రమ్యపథ దీప్తుల నింపుచు సాగిపోవగా మారిన గ్రామశోభ, నవ మంజులతాళిని కుంజమై, మనో హారిణి రాష్ట్రశోభ జనహాస వికాస విలాసమయ్యెడిన్!
ప్రసంగం సందర్భంగా డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ రచించిన ఈ పద్యాన్ని సీఎం కేసీఆర్ చదివి వినిపించారు.