Minister KTR | నిండు శాసనసభ వేదికగా మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ను చెండాడుకున్నారు. చరిత్రను చెబుతూ, వర్తమానాన్ని వివ రిస్తూ, ఆ పార్టీ భవిష్యత్తును ఆవిష్కరించారు. పల్లె, పట్టణ ప్రగతిపై జరిగిన చర్చకు సుదీర్ఘ సమాధానమిచ్చిన కేటీఆర్ కాంగ్రెస్కు అధికారమిస్తే రాష్ర్టానికి అంధకారమేనని తేల్చి చెప్పారు. ఒక్క చాన్స్ ఇవ్వాలంటూ కాంగ్రెస్ చేస్తున్న విజ్ఞ ప్తిని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజలు ఇప్పటికే పదిసార్లు అవకాశమిచ్చారని, అప్పుడు కాంగ్రెస్ ఏమి ఉద్ధరించిందని నిలదీశారు. తెలంగాణకు కాంగ్రెస్ చేసిన ద్రోహాన్ని ఒక్కొక్కటిగా వివరిస్తూ, ఆ పార్టీపై విమర్శల జడివాన కురిపించారు. 1956లో తెలంగాణకు ఆంధ్రకు ఇష్టంలేని బలవంతపు పెండ్లిచేసిన పాపాత్ములు ఎవరు? 1968లో 370 మంది పిల్లలను కాల్చి చంపింది ఎవరు? 1971లో 11 మంది సభ్యులను ప్రజలు గెలిపించి పార్లమెంటుకు పం పినా వాళ్ల ఆశ యాన్ని కాలరాసి కాంగ్రెస్లో కలుపుకున్నది ఎవరు? 2004లో మాటిచ్చి 2014 దాకా సాగదీసి వెయ్యి మందిని చంపింది ఎవరు? అని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు.
ఇన్ని పాపాలు చేసిన కాంగ్రెస్ ఇవాళ మళ్లా సిగ్గులేకుండా మాట్లాడుతున్నాదని దుయ్య బట్టారు. ‘తామే తెలంగాణ ఇచ్చామని కాంగ్రెస్ అనడం ఎంతవరకు సమంజసం? భారతీయులు బ్రిటిష్ వాళ్లపై కొట్లాడి దేశానికి స్వాతంత్రం తెచ్చుకుంటే, బ్రిటిష్ వాళ్లు మేమే స్వాతంత్రం ఇచ్చామంటే ఎంత గలీజ్ గా ఉంటుంది!’ అని ఆయన అన్నారు. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను గురించి వివరిస్తూ, నవమాసాలు మోసి ప్రసవించిన తల్లికి ఎంత బాధ ఉంటుందో అంత బాధ బీఆర్ఎస్కు ఉంటుం దని, మంత్రసాని పాత్ర పోషించింది కాంగ్రెస్ అన్నారు. వెయ్యి మందిని బలితీసుకున్న బలిదేవత సోనియా గాంధీ అని పీసీసీ అధ్యక్షుడు స్వయంగా అన్నారని గుర్తుచేశారు.
ఇది తాను చెప్పడంలేదని, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డే అన్నారని చెప్పారు. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలు కూడా అనేక విధాలుగా ఆలోచిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా రాజకీయాలకు సంబంధించి మంత్రి కేటీఆర్ ఓ సామెత చెప్పారు. ’ఇన్ లైఫ్ వెన్ పాలిటిక్స్ డిసైడ్స్ యూవర్ ఫ్యూచర్… యూ డిసైట్ వాట్ యువర్ ఫ్యూచర్ పాలిటిక్స్ ఈజ్’ అనే సామెత ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రాజకీయాల్లో ప్రజలు భాగస్వామ్యం కావాలనేది దీని ఉద్దేశమని తెలిపారు. ఇక ఎన్నికల సమయంలో తెలంగాణ రాజ కీయ రణ క్షేత్రంలో కొన్ని రాబంధులు మళ్లీ తిరుగుతూ.. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయన్నారు.
– : ప్రజలే నిర్ణేతలు :-
దేశంలో ఇంటింటికీ నల్లా నీళ్లిచ్చిన మొదటి రాష్ట్రం, ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఉన్నది, వరి ఉత్పత్తిలో నంబర్ వన్, అత్యధిక తలసరి ఆదాయం ఉన్న స్టేట్, రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్తు ఇస్తున్న ఏకైక రాష్ట్రం, బీడీ కార్మికులకు జీవనభృతి కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం, ఎకరానికి రూ.పది వేల పెట్టుబడి సాయం ఇచ్చే రాష్ట్రం, రైతులకు బీమా కల్పిస్తున్న రాష్ట్రం, రూ.ఒక లక్షా నూట పదహారు చొప్పున ఇచ్చి 13 లక్షల మంది ఆడబిడ్డలకు పెండ్లి చేసిన రాష్ట్రం, ఈ ఏడాది అత్యధికంగా ఐటీ ఉద్యోగాలు కల్పించిన రాష్ట్రం తెలంగాణ. అందుకే జై తెలంగాణ అంటున్నం. ఇది మా పర్ఫార్మెన్స్. మా ట్రాక్ రికార్డ్. నేను చెప్పింది తప్పని రుజువు చేస్తే, తెలంగాణ కన్నా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నట్టు రుజువుచేస్తే రేపు పొద్దున్న ఫస్ట్ అవర్లో నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా. చాయిస్ ప్రజల ముందు ఉన్నది. మేం చెప్పింది తప్పయితే, మేం చెప్పినదాంట్లో అవాస్తవాలుంటే మమ్మల్ని శిక్షించాలి. ఓడించాలి. మాకు అభ్యంతరం లేదు. కాంగ్రెస్ వాళ్లు చెప్పింది తప్పయితే వాళ్లకు డిపాజిట్లు కూడా రాకుండా చేయాలి.
– మంత్రి కేటీఆర్