Minister KTR | హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): సుకేశ్ చంద్రశేఖర్ అనే ఒక రోగ్ చేసిన అడ్డమైన మాటలపై న్యాయపరంగా కఠిన చర్యలు తీసుకుంటానని రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు ప్రకటించారు. ఒక నేరస్థుడు, మోసగాడు అయిన సుకేశ్ తనపై చేసిన మతిలేని ఆరోపణలు మీడియా ద్వారా తన దృష్టికి వచ్చాయని మంత్రి కేటీఆర్ శుక్రవారం ట్విట్టర్లో తెలిపారు. సుకేశ్ చంద్రశేఖర్ అనే వాడి గురించి తానెప్పుడూ వినలేదని, వాడెవడో కూడా తనకు తెలియదంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సుకేశ్ లాంటి నేరస్థుడు, మోసగాడు చేసిన అడ్డగోలు వ్యాఖ్యలను మీడియాలో ప్రసారం చేసే ముందు, ప్రచురించే ముందు జాగ్రత్తగా ఆలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Just learnt from media that a delusional fraudster and a noted criminal called Sukesh has made some ludicrous allegations about me
I have never heard of this rogue and intend to pursue strong legal action against him for his nonsensical utterances
Request media also to be…
— KTR (@KTRBRS) July 14, 2023
బహిరంగంగానే బెదిరింపులకు పాల్పడే వ్యక్తికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని అప్పగించారని మంత్రి కే తారకరామారావు విమర్శించారు. కాంగ్రెస్ను ఓ పోకిరి చేతిలో పెట్టారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ఒక స్కాంగ్రెస్ అని తెలిపారు. బీఆర్ఎస్ నాయకుడు దాసోజు శ్రవణ్కు అర్ధరాత్రిళ్లు ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, డీజీపీ అంజనీకుమార్ను కోరారు. తనకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడిన విషయాన్ని దాసోజు శ్రవణ్ ట్విట్టర్లో ట్వీట్ చేయగా, మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇలాంటి ఘటనలను తీవ్రంగా పరిగణించాలని, కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
I request Home Minister @mahmoodalibrs Garu and @TelanganaDGP Garu to kindly take this matter seriously and act sternly and swiftly as per law
It’s truly unfortunate that Scamgress now has been handed over to a thug in Telangana who is resorting to open threats https://t.co/qJWN0sS5Lw
— KTR (@KTRBRS) July 14, 2023