హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ప్రగతి భవన్లో కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ చేశారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కాకుండా కాంగ్రెస్ జోడో యాత్ర చేయాలని సూచించారు. ఇవాళ దేశంలో రాజకీయ శూన్యత ఏర్పడిందన్నారు. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఘోరంగా విఫలమైందన్నారు.
రాహుల్ పాదయాత్ర చేస్తుంటే.. ఆ పార్టీకి చెందిన గోవా ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారని గుర్తు చేశారు. తెలంగాణలో ఎన్ని రోజులైనా యాత్ర చేసుకోవచ్చు.. దాని వల్ల తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు రాహుల్కు తెలుస్తాయన్నారు. రాహుల్ తెలంగాణలో పాదయాత్ర చేసే సమయంలో ఆ పార్టీ ఎంపీలు కాంగ్రెస్ను వీడనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయని తెలిపారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ అట్టర్ ఫ్లాప్ అయిందని కేటీఆర్ పేర్కొన్నారు.