హైదరాబాద్ : ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి కేటీఆర్ ఎప్పటికప్పుడు ట్విట్టర్ వేదికగా తప్పుపడుతూనే ఉన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు గృహ వినియోగ సిలిండర్ ధరలను పెంచిన సమయంలోనూ కేటీఆర్ కేంద్రాన్ని తప్పుపడుతూ ట్వీట్ చేశారు.
తాజాగా కమర్షియల్ సిలిండర్ ధరల పెంపుపై కూడా బీజేపీ ప్రభుత్వాన్ని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విమర్శించారు. ఏప్రిల్ ఫూల్ తరహాలో జోక్ అయితే బాగుండేదని కేటీఆర్ ఎద్దెవా చేశారు.
19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 250 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఆ గ్యాస్ సిలిండర్ ధర రూ. 2,253కు చేరింది. పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని తెలిపారు.
I am seriously hoping this is an April fools joke! https://t.co/9smrxq6jTt
— KTR (@KTRTRS) April 1, 2022