KTR | హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ) : ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఫ్రెండ్ ఫస్ట్ … నేషన్ లాస్ట్ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు విమర్శించారు. తన దోస్తు కోసం ప్రజలు దాచుకున్న రెకల కష్టాన్ని దోచిపెడుతున్నారని ఆరోపించారు. ప్రధాని ప్రాధాన్యాల్లో పేదవాడు ఎకడ? అని సామాన్యుడు ప్రశ్నిస్తున్నాడని ధరల పెరుగుదలపై ఓ పేదవాడు మాట్లాడిన మాటలను ఆయన బుధవారం ట్వీట్ చేశారు.
ఇది తెలంగాణ సామాన్యుడి గళం.. ‘సామాన్య శాస్త్రం’ ఆకాశాన్నంటుతున్న పప్పు, ఉప్పు, నూనె ధరలు నియంత్రించే సోయి లేదు ప్రజలపై పెట్రో ధరల భారాన్ని తగ్గించాలన్న సోయి లేదు గ్యాస్ ధరలను భరించలేకపోతున్న మహిళలపై కనికరం లేదు కానీ..ఆగమేఘాల మీద అదానీ కంపెనీని ఆదుకోవడమే మీ ఏకైక లక్ష్యం! దేశం కోసం కాదు.. దోస్తు కోసం.. ప్రజలు దాచుకున్న రెకల కష్టాన్ని ధారపోస్తున్న వైనం! సామాన్యుడు ప్రశ్నిస్తున్నాడు.. ప్రధాని ప్రాధాన్యాల్లో పేదవాడు ఎకడ? దేశానికి అర్థమైపోయింది.. మీకు ఫ్రెండ్ ఫస్ట్.. నేషన్ లాస్ట్! అని ట్వీట్ చేశారు.
ఆ విధానంపై అధ్యయనం చేయండి
ఆశ్రమ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆహార నాణ్యతను గుర్తించే పద్ధతిని అమలు చేస్తున్న విధానంపై అధ్యయనం చేయాలని మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించారు. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో గిరిజన పిల్లల పోషహాహార స్థాయిని మెరుగుపరిచే ప్రయత్నంలో భాగంగా ఎటపల్లి తోడ్స ఆశ్రమ పాఠశాలలో ఏఐ ఆథారంగా పనిచేసే ప్రత్యేక యంత్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ మెషిన్ ద్వారా పాఠశాలలో ఉండే విద్యార్థి, అతని ప్లేట్ ఆహారాన్ని ఫొటో తీసి. కొన్ని సెకన్లలో ఎటువంటి మావన ప్రమేయం లేకుండా ఆహారం నాణ్యత బాగుందో లేదో గుర్తించి చెప్తుంది. ఈ యంత్రానికి సంబంధించిన ఫొటోను ట్విట్టర్లో కేటీఆర్ రీట్వీట్ చేస్తూ, దీని అమలుపై అధ్యయనం చేయాలని మంత్రులు సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, సంక్షేమ శాఖల కార్యదర్శులకు సూచించారు. మహారాష్ట్ర అధికారులతో మాట్లాడి మరింత సమాచారాన్ని సేకరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని కోరారు.
భూమిని రక్షించుకుందాం
మీరు భూమిని ఎలా వారసత్వంగా పొందా రో దాని కంటే మెరుగ్గా మీ పిల్లలకు ఇవ్వాలని మంత్రి కేటీఆర్ సూచించారు. మనకు జీవించడానికి మరో గ్రహం ఏమీ లేదని, మనం నివసించడానికి అనువైన ప్రాంతం భూమి ఒక్కటే అన్నారు. అన్ని జీవుల కొరకు భూమిని రక్షించడం మన బాధ్యత అని ట్వీట్ చేశారు.
నా ఫేవరెట్ ఇన్నోవేటర్ కీర్తి
వ్యవసాయ పనులకు ఉపయోగించేలా మల్టీపర్పస్ బ్యాగ్ను తయారు చేసిన సిరిసిల్లకు చెందిన కీర్తిని మంత్రి కేటీఆర్ అభినందించారు. తన ఫేవరెట్ ఇన్నోవేటర్లలో కీర్తి ఒకరని ఆదివారం ట్వీట్ చేశారు. ఆమె తయారు చేసిన బ్యాగు వ్యవసాయదారులకు ఎంతోగానో ఉపయోగుతుందని పేర్కొన్నారు.
అభినందనలు చెత్త ద్వారా కంపోస్టును తయారు చేసిన అపార్ట్మెంట్ వాసులను కేటీఆర్ అభినందించారు. నల్లగండ్లలోని అపార్ట్మెంట్లో వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వంటగదిలోని తడి, పొడి చెత్త ద్వారా 5 క్వింటాళ్ల కంపోస్టు తయారుచేశారు. కాలనీవాసులు చేసిన ట్వీట్పై స్పందించిన కేటీఆర్, వెల్ఫేర్ అసోసియేషన్ వాసులను అభినందించారు.
మేకిన్ తెలంగాణ విజయవంతం
మేకిన్ తెలంగాణ విజయవంతమైందని చెప్పడానికి సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్లో ఏర్పాటు చేసిన అకృతి ఐ కేర్ కంపెనీ ఉత్పత్తులు నిదర్శనం గా నిలుస్తాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇక్కడ తయారైన కంటి అద్దాలు 15 దేశాలకు ఎగుమతి అవుతున్నాయని కేటీఆర్ ఆదివారం ట్విట్టర్ ద్వారా తెలిపారు. కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రానికి అవసరమైన కంటి అద్దాల్లో 25 లక్షలు ఇక్కడే తయారు చేశారని ఆయన వివరించారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమం దేశంలోనే అతి పెద్ద కంటి పరీక్షల కార్యక్రమమని పేర్కొన్నారు.