హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్పై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్ర పురోభివృద్ధి దెబ్బతినేలా మాట్లాడిన రాజాసింగ్పై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ పునర్విభజన చట్టంలో వరంగల్ జిల్లాలో రైల్ కోచ్ ఫ్యాక్టరీ పెడుతామని కేంద్రం హామీ ఇచ్చింది. ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం 2016లో 150 ఎకరాల భూమి ఇచ్చింది. కానీ ప్రభుత్వం విజ్ఞప్తిని బుట్టదాఖలు చేశారు. మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో 2018లో రైల్ కోచ్ ఫ్యాక్టరీని లాతూర్కు కేటాయించారు.
దేశంలో ఎక్కడా రైల్ కోచ్ ఫ్యాక్టరీ అవసరం లేదని 2016లో కేంద్రం పార్లమెంట్లో లిఖితపూర్వకంగా రాసి ఇచ్చింది. కానీ ఇచ్చిన మాటను తుంగలో తొక్కింది అని తెలిపారు. ఇక ఐటీఐఆర్ను ఎందుకివ్వలేదు అని ప్రశ్నించారు. ట్రిపుల్ ఐటీ, ట్రైబల్ యూనివర్సిటీ అడిగాం. అవి ఇవ్వలేదు. 2018 ఎన్నికల్లో పసుపుబోర్డు కచ్చితంగా ఇస్తామని బాండ్ పేపర్లు రాసిచ్చారు. ఇప్పుడు పసుపు బోర్డు ఊసే లేదు అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
ప్రత్యేక ప్రసారం