హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని గందరగోళ పరుస్తున్న కాంగ్రెస్, బీజేపీ నాయకులపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. వ్యవసాయం అనుబంధ విభాగాలకు రూ. 2 లక్షల 71 వేల కోట్లు ఖర్చు పెట్టామని తెలిపారు. తాను తెలంగాణ భవన్ వేదికగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు సవాల్ విసురుతున్నా.. ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి, ప్రజలను గందరగోళం పరచడం సరికాదు.
కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతులకు ఎంత మేలు చేశారో చెప్పండి. దమ్ముంటే చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. శ్వేతపత్రాల్లో పోటీ పడుదాం.. నల్ల చట్టాల్లో కాదు. శ్వేతపత్రాలు ప్రచురించే ప్రభుత్వం మాది. నల్లచట్టాలు తెచ్చే ప్రభుత్వం మీది. మీకు, మాకు పోలికే లేదు. తిట్ల పురాణం కాదు. దమ్ముంటే రైతులకు ఏం చేశారో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
రాజకీయ పర్యాటకులు వస్తే అభ్యంతరం లేదు. తెలంగాణ పర్యాటక రంగానికి అది మేలు చేస్తుండొచ్చు. ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం కాదు. గణాంకాలు ఉంటే చెప్పాలన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అంటేనే నో డేటా ఆవేలబుల్ ప్రభుత్వం అని కేటీఆర్ పేర్కొన్నారు.