సింగపూర్ ఓపెన్లో అసాధారణ ఆటతీరుతో టైటిల్ దక్కించుకున్న స్టార్ షట్లర్ పీవీ సింధుకు దేశం నలుమూలల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మహిళల సింగిల్స్ విభాగంలో ఫైనల్ చేరిన సింధు.. చైనాకు చెందిన వాంగ్ జీ యీపై 21-9, 11-21, 21-15 తేడాతో నెగ్గింది.
దీంతో తన కెరీర్లో తొలిసారి సింగపూర్ టైటిల్ కైవసం చేసుకుంది. ఈ క్రమంలో తెలంగాణ కేబినెట్ మంత్రి కేటీఆర్ కూడా సింధును అభినందించారు. ‘‘మెనీ కంగ్రాచ్యులేషన్స్ సింధు’’ అని ట్వీట్ చేశారు.
Many congratulations 🎉 @Pvsindhu1 👏 https://t.co/YGoyQEfdyg
— KTR (@KTRTRS) July 17, 2022