కామన్వెల్త్ క్రీడల్లో భారత స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు స్వర్ణ పతకం పట్టేసింది. మహిళల సింగిల్స్ ఫైనల్లో కెనడాకు చెందిన మిషెల్లే లిని ఓడించిన సింధు.. పసిడి పతకాన్ని ముద్దాడింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ కేటీఆర్.. ఆమెను అభినందిస్తూ ట్వీట్ చేశారు.
‘‘భారత అత్యుత్తమ క్రీడాకారుల్లో ఒకరైన పీవీ సింధుకు.. కామన్వెల్త్ గేమ్స్లో మహిళల సింగిల్స్ విభాగంలో స్వర్ణం గెలిచి తన కలెక్షన్లో ఈ పతకం కూడా చేర్చుకున్న సందర్భంగా శుభాకాంక్షలు’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇప్పటి వరకు సింధు ఖాతాలో కామన్వెల్త్ స్వర్ణం లేదు. 2014లో కాంస్యంతో సరిపెట్టుకున్న ఆమె.. 2018లో సిల్వర్ మెడల్ సాధించింది. అయితే ఈసారి మరింత పట్టుదలగా ఆడి పసిడిని ముద్దాడింది.
Congratulations @Pvsindhu1 one of India’s greatest athletes, on winning & adding the elusive Commonwealth Games women’s singles gold to her collection 👏#CWG2022 #Badminton pic.twitter.com/NItDRhYWSQ
— KTR (@KTRTRS) August 8, 2022