Revanth Reddy | హైదరాబాద్, ఆగస్టు 8(నమస్తే తెలంగాణ): సిగ్గూఎగ్గు లేకుండా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి శవ రాజకీయం చేస్తున్నారు. ప్రజాగాయకుడు గద్దర్ మరణాన్ని కూడా రాజకీయంగా వాడుకునే కుటిలయత్నం చేస్తున్నారు. అధికార లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలను నిర్వహించిన ప్రభుత్వంపై అడ్డగోలు విమర్శలు చేస్తున్నారు. మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన రేవంత్రెడ్డి అబద్ధాలను అలవోకగా వల్లెవేశారు. ఆయన చెప్పిన అబద్ధాలకు అసలు వాస్తవాలు.
నిజం: గద్దర్ మరణ వార్త తెలియగానే ఇతర అంశంపై ప్రసంగిస్తున్న మంత్రి కేటీఆర్ తన ప్రసంగాన్ని ఆపేసి, గద్దర్ మృతికి నిండు సభలో నిల్చొని సంతాపాన్ని ప్రకటించారు. తెలంగాణ ఉద్యమానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. సభా నాయకుడు సీఎం కేసీఆర్ ఆదేశాలు లేకుండా మంత్రి కేటీఆర్ సభలో ప్రకటన చేస్తారా? ఈ విషయం రేవంత్రెడ్డికి తెలియంది కాదు. కానీ బట్టకాల్చి మీదేసే ప్రయత్నం చేస్తున్నారు.
నిజం: గద్దర్ మరణవార్త తెలిసిన వెంటనే సభలో ఆయనకు సంతాపం ప్రకటించేలా సీఎం కేసీఆర్ ఆదేశించారు. గద్దర్ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అసెంబ్లీ ముగియగానే కేటీఆర్తోపాటు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు ఎల్బీ స్టేడియంకు వెళ్లి గద్దర్కు నివాళులర్పించారు. సీఎం స్వయంగా గద్దర్ నివాసానికి వెళ్లి పార్థివదేహానికి నివాళులు అర్పించి కుటుంబసభ్యులను ఓదార్చారు.
నిజం: తొలిరోజు మినహా మిగిలిన మూడురోజుల్లో ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రతి అంశంపైనా ప్రభుత్వం చర్చించింది. ఇటీవల కురిసిన వర్షాల నష్టంపై మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సుదీర్ఘ వివరణ ఇచ్చారు. నిజానికి కాంగ్రెస్ సభ్యులే చర్చకు ఆసక్తి కనబరచలేదు. సభలో మాట్లాడేందుకు కనీసం సమాచారం సేకరించకుండా పత్రికల కథనాలు, ఎవరో చెప్పిన అంశాలపై ఆధారపడి ప్రశ్నలు అడిగారు. పైగా తమకు ప్రిపేర్ అయ్యేందుకు సమయం లేదంటూ చర్చ నుంచి తప్పుకునే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ సభ్యులు అంతా కలిసి ఒకేసారి పట్టుమని పది నిమిషాలు కూడా సభలో కూర్చోలేదు. ఇలాంటి ప్రతిపక్షం ఇప్పుడు ప్రభుత్వంపైనే చర్చ జరపలేదంటూ నిందలు వేయడం విడ్డూరం.
నిజం: ఉద్యమం తారస్థాయికి చేరినప్పుడు రేవంత్రెడ్డి తెలంగాణను వ్యతిరేకించిన టీడీపీలో ఉన్నారు. చంద్రబాబుకు తొత్తులా పని చేస్తూ తెలంగాణను అడ్డుకోవడానికి చంద్రబాబు చేసే ప్రయత్నంలో భాగస్వాముడయ్యారు. తెలంగాణపై నిబద్ధత ఉంటే.. తెలంగాణను వ్యతిరేకిస్తున్న టీడీపీని ఎందుకు వీడలేదు? బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు చంద్రబాబుతో కలిసి ఓటు-నోటు కుట్రకు తెరలేపి అడ్డంగా దొరికిపోయారు. అలాంటి రేవంత్రెడ్డి ఇప్పుడు తెలంగాణ పట్ల తనకు నిబద్ధత ఉన్నదంటూ చిలక పలుకులు పలుకుతున్నారు. రాష్ట్ర సాధన కోసం పదవులను తృణప్రాయంగా వదిలేసి 14 ఏండ్లపాటు పోరాటం చేసి, చావు అంచుల వరకు వెళ్లి రాష్ర్టాన్ని సాధించిన సీఎం కేసీఆర్ను తెలంగాణ ద్రోహి అంటూ రేవంత్ విమర్శించడం ఆయన సంకుచిత రాజకీయాలకు పరాకాష్ఠ.