హైదరాబాద్ : హుస్సేన్ సాగర్ సమీపంలోని అంబేడ్కర్ నగర్లో నూతనంగా నిర్మించిన 330 ఇండ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ స్థానిక మహిళలు బోనాలతో ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత మంత్రి కేటీఆర్ ఆడబిడ్డలతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. ఈ క్రమంలో మహిళలతో మాట్లాడిన కేటీఆర్.. డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం ఎలా ఉందని అడిగారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. మురికివాడల్లో ఉన్న తమకు అద్భుతమైన ఇండ్లు నిర్మించి ఇవ్వడం సంతోషంగా ఉందని లబ్దిదారులైన మహిళలు కేటీఆర్కు చెప్పి.. కృతజ్ఞతలు తెలిపారు.