హైదరాబాద్ : నగరంలోని హుస్సేన్ సాగర్ వద్ద డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాట్లను మంత్రి కొప్పుల ఈశ్వర్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. 125 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్న అంబేద్కర్ విగ్రహాన్ని 15 నెలల్లో ఏర్పాటు చేస్తామన్నారు. విగ్రహం వద్దే మ్యూజియం, ఆర్ట్ గ్యాలరీ, గ్రంథాలయం కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. లేజర్ షో అందుబాటులోకి తెస్తామని తెలిపారు. విగ్రహ ఏర్పాటుతో పాటు ఇతర పనులకు రూ. 100 కోట్లతో టెండర్లు ఇచ్చామని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.