రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్.. మహిళా కూలీలతో కలిసి వరి నాటేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మిరెడ్డిపల్లి శివారులో వరి నాటుకు సిద్ధమవుతున్న పొలంలోకి మంత్రి కొప్పుల ఈశ్వర్ దిగారు. రైతులతో కలిసి నాగలితో జంబు కొట్టారు. ఆ తర్వాత మహిళా కూలీలతో కలిసి వరి నాటు వేశారు. కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారితో కలిసి కొప్పుల ఈశ్వర్ భోజనం చేశారు.