Minister Koppula | సీనియర్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి చేసిన ఆరోపణలను మంత్రి కొప్పుల ఈశ్వర్ ఖండించారు. రాజకీయాల్లో అనుభవజ్ఞుడైన జీవన్రెడ్డి తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ పాలనలో వ్యవసాయానికి కనీసం తొమ్మిది గంటల కరెంటు ఇవ్వలేదని రైతులు చెప్తే రాజకీయాల నుంచి తప్పుకుంటారా? అని ప్రశ్నించారు. 24 గంటల విద్యుత్ రాజకీయ సన్యాసం చేస్తామని చెప్పిన జీవన్రెడ్డి.. ఇచ్చిన మాటకు కట్టుబడి రాజకీయాల నుంచి తప్పుకోవాలన్నారు.
ఆ నాడు కాంగ్రెస్ పాలనలో పైరవీలు, భూకబ్జాలు, లంచగోండి వ్యవహారాలు తప్పా ఎలాంటి ఉత్సవాలు చేయలేదన్నారు. దళితబంధు పతకంపై బురద జల్లే ప్రయత్నం కాంగ్రెస్ నాయకులూ చేస్తున్నారని, ఇథనాల్ ప్రాజెక్ట్పై కావాలనే జీవన్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.