Minister Koppula | బీఆర్ఎస్ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నదని.. ఇప్పటి వరకు చేయనిదేం ఉందో చెప్పాలంటూ కాంగ్రెస్ను నిలదీయాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. బుగ్గారం మండలం టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి మంత్రి కొప్పుల, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టాలన్నారు.
గ్రామ గ్రామాన బీఆర్ఎస్ ప్రచారానికి మంచి స్పందన లభిస్తుందన్నారు. పెద్దల్లో పెద్దగా, చిన్నల్లో చిన్నగా ఉంటున్నానని వస్తున్నానని. 30ఏళ్లుగా పగటిపూట నిద్రపోవడం మానేశానన్నారు. జీవితం మొత్తం ప్రజల కోసమే బతుకుతున్నానని చెప్పారు. నియోజకవర్గం అభివృద్ధి, ప్రజల క్షేమమే కావాలన్నారు. ఇందుకు మీవంతు సహాయంగా రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో అధికారంలో ఉన్న ఏ పార్టీ ప్రజల క్షేమన్ని పట్టించుకోలేదన్నారు. రైతుబంధు, రుణమాఫీ, దళితబంధుపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని, దాన్ని ఎవరూ నమ్మొద్దన్నారు.