హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): వచ్చే నెల చివరి నాటికీ వనమహోత్సవం లక్ష్యాన్ని సాధించాలని మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నిర్వహించనున్న ప్రత్యేక వనమహోత్సవంపై మంత్రి సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా 16.06 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఆదివారం నాటికి 9.06 కోట్ల మొక్కలను నాటినట్లు అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.
దీంతో మంత్రి స్పందిస్తూ వనమహోత్సవాన్ని ప్రజా ఉద్యమంగా చేపట్టాలని, ఇందులో అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములు చేయాలని సూచించారు. దేవాలయాల పరిధిలో, దేవాదాయశాఖకు చెందిన భూముల్లో విసృ్తతంగా మొక్కలు నాటేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు.