కొమురవెల్లి: భక్తుల కొంగుబంగారం కొమురవెల్లి (Komuravelli) మల్లన్నస్వామి కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతున్నది. ఉజ్జయిని పీఠాధిపతి సిద్ధలింగ రాజదేశికేంద్ర పర్యవేక్షణలో బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మలతో మల్లికార్జునుడి కల్యాణమహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామివారి కల్యాణాన్ని తిలకించేందుకు రాష్ట్ర నలుమూలలతోపాటు పొరుగు రాష్ర్టాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
స్వామి, అమ్మవార్లకు మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్.. ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని సౌకర్యాలు కల్పించారు. భక్తుల కోసం హైదరాబాద్తోపాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతున్నది.