హైదరాబాద్: ఉమ్మడి ఏపీ భవన్ విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy) అన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణ పనులను చేపట్టాలనుకుంటున్నామని తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన.. ఉమ్మడి ఏపీ భవన్కు వెళ్లారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ఉమ్మడి ఏపీ భవన్కు చెందిన ఆస్తులను పరిశీలించామన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. దానికోసం తనవంతు కృషి చేస్తానని తెలిపారు. ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారని వెల్లడించారు. విభజన వేళ ఇచ్చిన హామీలను అమలుచేయకపోవడం బాధకరమని చెప్పారు.