నల్లగొండ : ప్రజావాణి(Grievance Cellలో వచ్చిన ప్రతి అర్జీని పరిశీలించి పరిష్కరించాలని రోడ్లు, భవనాల శాఖ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komatireddy) అన్నారు. సోమవారం కలెక్టరేట్ (Nallagonda)లో ప్రజావాణి కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి పాల్గొన్నారు. ప్రజలు తమ సమస్యలను మంత్రికి విన్నవించుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలప్రతి సమస్యను కూలంకషంగా విని పరిష్కరించాలని కలెక్టర్కు సూచించారు. ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.