హైదరాబాద్ సిటీబ్యూరో, మే 9 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలులో బోగీలను 8 నుంచి 16కు పెంచేందుకు ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ అంగీకరించినట్టు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వెల్లడించారు.
ప్రయాణికుల సంఖ్య ఎక్కువవుతుండటంతో బోగీల పెంపునకు కేంద్రం సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు మంగళవారం ట్విట్టర్ ద్వారా తెలిపారు.