హైదరాబాద్ : యాసంగి ధాన్యం సేకరణపై మంత్రి గంగుల కమలాకర్ శుక్రవారం మిల్లర్స్ అసోసియేషన్, మిల్లర్లతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లపై చర్చలు సఫలమయ్యాయి. ధాన్యం అన్లోడింగ్కు మిల్లర్లు అంగీకారం తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్రం నిరాకరించినా సీఎం ధాన్యం కొంటున్నారని మంత్రి గంగుల పేర్కొన్నారు. ధాన్యం సేకరణలో మిల్లర్లు భాగస్వామ్యం కావాలని కోరారు. కిలో ధాన్యం తరుగుపెట్టడానికి వీల్లేదన్నారు. మిల్లర్ల ప్రతిపాదనలు సీఎస్ కమిటీకి తీసుకెళ్తామన్నారు. అయితే, ధాన్యం కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వానికి
సహకరిస్తామని మిల్లర్లు పేర్కొన్నారు.
లాభాలు రాకున్నా సరే.. నష్టాలు లేకుండా చూడాలని కోరుతున్నట్లు తెలిపారు. మిల్లర్లను దొంగలుగా చిత్రీకరించడం బాధాకరమని, కేంద్రమంత్రి కిషన్రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మోహన్రెడ్డి అన్నారు. మాపై కేంద్రం, కేంద్రమంత్రి కిషన్రెడ్డి అనవసర ఆరోపణ చేస్తున్నారని ఆరోపించారు. రైస్మిల్లుల్లో ఎలాంటి గోల్మాల్ జరుగలేదని పేర్కొన్నారు. మిల్లుల్లో ధాన్యం గోల్మాల్ జరిగిందా ? లేదా ? అని కిషన్రెడ్డి తెలుసుకొని మాట్లాడాలన్నారు. మిల్లర్లపై లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కేంద్రం తీరుతో రాష్ట్రంలో రైస్ మిల్లలు మూతపడే అవకాశం ఉందని పేర్కొన్నారు.