హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): ఉద్యమకారుడిగా, విప్లవ కవిగా తన జీవితాన్ని పీడిత ప్రజల కోసం త్యాగం చేసిన ప్రజా గాయకుడు గద్దర్ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్ర భుత్వం నిర్ణయించిందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం రవీంద్రభారతిలో గద్దర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నామని వెల్లడించారు. సమాజంలో ఉన్న అంతరాలు తొలగించాలని గద్దర్ తన జీవితాంతం పరితపించి, తన గళంతో ప్రజల్లో చైతన్య స్ఫూర్తిని రగిలించారని కొనియాడారు.