సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో అన్ని మతాలకు సమప్రాధాన్యం లభిస్తున్నదని మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. నల్గొండ టౌన్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ముస్లింలకు శనివారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్లో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, నల్గొండ ఎమ్మెల్యే భూపాల్రెడ్డితో కలిసి జగదీశ్రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ వచ్చాక బతుకమ్మ, క్రిస్మస్, రంజాన్ పండుగలను పురస్కరించుకొని ప్రభుత్వం తరఫున కానుకలు అందజేస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అన్ని వర్గాలు ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నాయని వెల్లడించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా ప్రార్థనలు చేయాలని ముస్లింలను మంత్రి జగదీశ్రెడ్డి కోరారు.