నాంపల్లి: టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి గెలుపు తర్వాత మునుగోడు నియోజకవర్గం జెట్ స్పీడ్తో అభివృద్ధి చెందుతుందని మంత్రి జగదీశ్రెడ్డి చెప్పారు. ఇవాళ నాంపల్లి మండలం ఎస్ లింగోటంలో ఆయన ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంత్రితోపాటు ఎమ్మెల్యే రవీంద్రకుమార్, సీపీఐ, సీపీఎం నేతలు కూడా ప్రచారంలో పాల్గొన్నారు.
ప్రచారానికి వచ్చిన నేతలకు స్థానిక మహిళలు బోనాలు, బతుకమ్మలు, కోలాటాలతో ఘనస్వాగతం పలికారు. ప్రచారంలో మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ.. కులమతాల పేరుతో బీజేపీ కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. బీజేపీ మయమాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దన్నారు. నల్లగొండలో ఫ్లోరైడ్ భూతాన్ని పారదోలిన సీఎం కేసీఆర్కు మనుగోడు ఓటర్లు మద్దతు నిలవాలని కోరారు. కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి గెలుపుతో మునుగోడులో అభివృద్ధి జెట్ స్పీడ్తో సాగుతుందని మంత్రి చెప్పారు.