కడెం, జూన్ 26: కడెం కుడి కాలువ గైడ్వాల్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ అన్నారు. కడెం కుడి కాలువ గైడ్వాల్ పనులను శనివారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. రైతులు వానకాలం పంటలకు సిద్ధమవుతున్న సమయంలో కాలువ గైడ్వాల్ పనులను వేగంగా పూర్తి చేయాలని నీటి పారుదలశాఖ అధికారులను ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు రానివ్వద్దని సూచించారు. అనంతరం పల్లెప్రకృతి వనాన్ని సందర్శించారు. సర్పంచ్, ఉపసర్పంచ్ను అభినందించారు. మండలకేంద్రానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త ఎండీ గౌసొద్దీన్ (చోటు) తండ్రి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా, బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే రేఖానాయక్ పరామర్శించారు.
షాదీఖాన భవనాన్ని పూర్తి చేస్తాం
మండల కేంద్రంలోని షాదీఖాన భవనాన్ని త్వరగా పూర్తి చేస్తామని ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ మైనార్టీలకు భరోసా ఇచ్చారు. కడెంలో అసంపూర్తిగా ఉన్న షాదీఖాన భవనాన్ని స్థానిక నాయకులు, అధికారులతో కలిసి ఆమె శనివారం పరిశీలించారు. భవన నిర్మాణానికి తనవంతుగా రూ. 20 లక్షలను అందజేస్తానని తెలిపారు. ఎంపీపీ ఫండ్ నుంచి మరో రూ. 10 లక్షలను ఎంపీపీ అలెగ్జాండర్ ప్రకటించారు. మండల సర్పంచ్ల ఫోరం తరఫున రూ. 50 వేలు అందజేస్తామని అధ్యక్షుడు గోళ్ల వేణుగోపాల్ హామీ ఇచ్చారు. రూ. 30.50 లక్షలతో పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేఖానాయక్, ఎంపీపీ అలెగ్జాండర్, గోళ్ల వేణుగోపాల్ను ముస్లిం నాయకులు సత్కరించారు. కార్యక్రమాల్లో జడ్పీటీసీ పురపాటి శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి మెలుగూరి రాజేశ్వర్గౌడ్, తహసీల్దార్ ఖలీం, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఆర్ఐ రాజన్న, టీఆర్ఎస్మండల అధ్యక్షుడు జొన్నల చంద్రశేఖర్, మండల కన్వీనర్ కానూరి సతీశ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నల్ల జీవన్రెడ్డి, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు రఫిక్ హైమద్, సర్పంచ్లు అనూష, ఆకుల బాలవ్వ, బద్దెనపల్లి విజయ, రాజారెడ్డి, మైనార్టీ నాయకుడు మక్బూల్, నాయకులు ఆకుల లచ్చన్న, లక్ష్మణ్, రాజారెడ్డి, బొడ్డు గంగన్న, హసీబ్, బోర్లకుంట రాజేశ్ నేత, నల్లగొండ తిరుపతిరెడ్డి, ఆజాం, నీటిపారుదలశాఖ సిబ్బంది పాల్గొన్నారు.