Minister Jagadish Reddy | సూర్యాపేట : శోభ కృత్ నామ సంవత్సరంలో అందరికీ శుభం కలగాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు( Ugadi Wishes ) తెలిపారు. సూర్యాపేట( Suryapeta ) లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న మంత్రి జగదీశ్ రెడ్డి( Minister Jagadish Reddy )ని వేదపండితులు ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నో అపోహలు, అనుమానాల మధ్య తెలంగాణ సాధించామని తెలిపారు. తెలంగాణ జాతి అంతా ఒక్కటేనని, ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని మంత్రి ఆకాంక్షించారు.
ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ రాజేంద్ర ప్రసాద్, అడిషనల్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.