సూర్యాపేట : దేశంలో ఎక్కడా లేని విధంగా దివ్యాంగుల సమగ్రాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నది విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. బుధవారం సూర్యాపేటలోని మార్కెట్ యార్డ్ నందు దివ్యాంగుల పింఛన్లు 3016 నుంచి వె 4016 పెంచిన పెన్షన్స్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు పింఛను వెయ్యి పెంచి 4 016 రూపాయలు ప్రతి దివ్యాంగుడుకి అందజేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో ఇస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ ఇవ్వటం లేదని, ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఘనత అని మంత్రి పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులలలో చదువుకునే వారికి ల్యాప్టాప్లు, ఉద్యోగాలు చేసే వారికి స్కూటర్లు, ఎలక్ట్రికల్ మోటార్ సైకిల్ అందజేస్తుందన్నారు.
దివ్యాంగుల పెన్షన్ గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఎంత తక్కువ పెన్షన్ ఇస్తున్నారో లెక్కలతో సహా వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సీహెచ్ ప్రియాంక, డీఆర్డీవో కిరణ్ కుమార్, జడ్పీటీసీలు జీడి భిక్షం, నెమ్మది భిక్షం, తదితరులు పాల్గొన్నారు.