Minister Jagadish Reddy | హైదరాబాద్ : రాష్ట్రంలో బీజేపీ నేతలు( BJP Leaders ) శాశ్వత నిరుద్యోగులుగా మిగిలిపోతారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి( Minister Jagadish Reddy ) పేర్కొన్నారు. ఎన్ని దీక్షలు చేసినా బీజేపీ నేతలకు ఉద్యోగాలు( Govt Jobs ) వచ్చే ప్రసక్తే లేదని విమర్శించారు. టీఆర్ఎస్ఎల్పీ( BRSLP )లో ఎమ్మెల్యే గాదరి కిశోర్, ఎమ్మెల్సీ రవీందర్ రావుతో కలిసి మంత్రి జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు గత వారం రోజుల నుంచి చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ నేతలు నిరుద్యోగ దీక్ష చేస్తున్నారు. ..ఎన్ని దీక్షలు చేసినా బీజేపీ నేతలకు ఉద్యోగాలు రావు. బండి సంజయ్( Bandi Sanjay ) ధర్నా, దీక్షలు చేస్తే ఢిల్లీలో చేయాలి ఇక్కడ కాదు అని జగదీశ్ రెడ్డి సూచించారు.
ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టిన మోదీ ప్రభుత్వం( Modi Govt ).. కొత్త ఉద్యోగాలను భర్తీ చేయడం లేదని మంత్రి పేర్కొన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి ఈ దేశ యువతను మోదీ మోసం చేశారని మండిపడ్డారు. ముందు దేశంలో ఉద్యోగాలు భర్తీ చేయమని మోదీకి చెప్పి బీజేపీ నేతలు ఇక్కడ ధర్నాలు చేయాలి.. అపుడు బీజేపీ నేతలకు ఉద్యోగాలు ఇచ్చేది తెలంగాణ ప్రజలు ఆలోచిస్తారు అని పేర్కొన్నారు.
నిరుద్యోగులకు నష్టం జరగనివ్వమని మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ నేతలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగేవి కుంభకోణాలు.. తెలంగాణలో మాత్రం స్కీమ్స్ అమలవుతున్నాయి. వ్యాపం స్కాంలో మధ్యప్రదేశ్లో సాక్షులను చంపిన నీచులు బీజేపీ నేతలు అని మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాలన్నీ కలిపినా తెలంగాణ అన్ని ఉద్యోగాలు ఇవ్వలేదు. బండి సంజయ్కు ఛాలెంజ్ చేస్తున్నా.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ కన్నా ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపించగలరా..? అని జగదీశ్ రెడ్డి సవాల్ చేశారు.
కేటీఆర్ గురించి మాట్లాడే స్థాయి రాష్ట్ర బీజేపీ నేతలకు లేదు అని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల ఐటీ మంత్రుల పేర్లు బీజేపీ నేతలు చెప్పగలరా? అని ప్రశ్నించారు. కానీ తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్( Minister KTR )ను ప్రపంచం మొత్తం గుర్తిస్తుందన్నారు. ఎన్నో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత కేటీఆర్ది అని స్పష్టం చేశారు. కేటీఆర్ మీద ఈర్ష్యతోనే బీజేపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
పేపర్ లీకేజీకి సంబంధించి కేటీఆర్పై ఆరోపణలు చేయడం సరికాదు.. దమ్ముంటే సిట్( SIT )కు బీజేపీ నేతలు ఆధారాలు సమర్పించాలని జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. సిట్ ముందు హాజరయ్యేందుకు బండి సంజయ్ ఎందుకు వెనుకంజ వేస్తున్నారు. బీజేపీ నేతలను మాటలను నిరుద్యోగులు నమ్మరు అని పేర్కొన్నారు. దోషులు ఎంతటి వారైనా సరే చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.