సూర్యాపేట, మార్చి 8 (నమస్తే తెలంగాణ): ‘రాజకీయ దురుద్దేశంతోనే ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు. బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం దుర్మార్గాల పరాకాష్టకు ఇది నిదర్శనం’ అని రాష్ట్ర విద్యుత్తుశాఖ మం త్రి జగదీశ్రెడ్డి మండిపడ్డారు. సూర్యాపేట లో మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ పాలకులకు కంట్లో నలుసుగా మారిన ఢిల్లీలోని ఆప్, తెలంగాణలోని బీఆర్ఎస్ ప్రభుత్వాలను ఇ బ్బంది పెట్టే కుట్రలో భాగమే ఇది అన్నారు. సీఎం కేసీఆర్ ఆత్మైస్థెర్యం దెబ్బ తీయాలన్నది మోదీ సర్కార్ యోచనగా కనిపిస్తున్నదని పేర్కొన్నారు. ఇటువంటి పప్పులు కేసీఆర్ దగ్గర ఉడకవని చెప్పారు. నియంతలు ఎప్పుడూ నిలబడిన దాఖలాలు లేవని, ప్రపంచంలో అంతమైన నియంతల కంటే మోదీ గొప్పోడు ఏం కాడని అన్నారు. మోదీ దుర్మార్గాలకు కాలం చెల్లిందన్నారు.