హైదరాబాద్ : మన ఉన్నతికి కారణభూతులు తల్లిదండ్రులేనని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేటలో ప్రపంచ వృద్ధుల దినోత్సవ వేడుకలు శనివారం నిర్వహించగా.. మంత్రి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వయోవృద్ధులు మన ఆస్తిపాస్తులని, అలాంటి సంపదను కాపాడుకోవాల్సిన గురుతర బాధ్యత మనందరిపై ఉందన్నారు.
పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల త్యాగాలు వెలకట్టలేనివన్నారు. వృధ్యాప్యంలో వారిని కాపాడుకోవడమే మన ధర్మమని, దేశ సంస్కృతి, సాంప్రదాయాల్లో అదీ ఒక భాగమేనన్నారు. దేశ సంస్కృతి, సాంప్రదాయాల్లో పిల్లల పెంపకానికి ప్రాముఖ్యత ఉంటుందో అంతకు మించి వయోవృద్ధుల పోషణకు అంతటి ప్రాధాన్యం ఉంటుందన్నారు.