నల్లగొండ : ఈ నెల 14న నల్లగొండ జిల్లాలో ఐటీ, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పర్యటించనున్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభలోనూ పాల్గొననున్నారు. ఈ మేరకు సభ విజయవంతానికి ఏర్పాట్లు చేస్తుండగా.. ఇందులో భాగంగా మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, ఎమ్మెల్యే నోముల భగత్, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్తో కలిసి మాలియా మున్సిపల్ పరిధిలో సభాస్థలి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం హైదరాబాద్ మహానగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు పెద్దవూర మండలం సుంకేశాలలో ఏర్పాటు చేసిన ఇంటెక్ వెల్ను పరిశీలించారు.