సూర్యాపేట : తెలంగాణలో సీఎం కేసీఆర్(CM KCR) నాయకత్వంలో అన్ని మతాలకు సమ ప్రాధాన్యం లభిస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి(Minister Jagadish reddy) పేర్కొన్నారు. సూర్యాపేట(Suryapeta) జిల్లా ఆత్మకూర్ మండలం నశీంపేట గ్రామంలో జరిగిన బొడ్రాయి పండుగ మహోత్సవంలో మంత్రి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో సర్వమత సమ్మేళనాల పరిమళానికి తెలంగాణ రాష్ట్రం నిలువుటద్ధమన్నారు.
ఆచారాలు, భిన్న సాంప్రదాయాలకు దేశంలోనే తెలంగాణ ప్రత్యేకమని తెలిపారు. దుష్టశక్తులు, ప్రకృతి ప్రకోపాల నుంచి కాపాడే సర్వదేవతల స్వరూపం బొడ్రాయి పండుగ అని వెల్లడించారు. గ్రామస్తులు కోరిక మేరకు పాఠశాల ను సందర్శించిన మంత్రి అక్కడి అసౌకర్యాలు , ఇరుకుగా ఉన్న స్కూల్ అవరణ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమం లో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోప గానీ వెంకట్ నారాయణ గౌడ్ , ఎంపీపీ స్వర్ణలత చంద్రా రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు తూడి నర్సింహ రావ్, సింగిల్ విండో చైర్మన్ కొనతం సత్యనారాయణ రెడ్డి, జనయ్యా, సర్పంచ్ రవి, ఉపసర్పంచ్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.