యాదాద్రి భువనగిరి : దళితబంధు విప్లవాత్మకమైందని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేలా సీఎం కేసీఆర్ పథకాన్ని రూపొందించారన్నారు. మునుగోడు నియోజకవర్గ పరిధిలోని గుడి మల్కాపూర్, చిమిర్యాల, జమస్థాన్పల్లి గ్రామాలకు చెందిన వంద మంది లబ్ధిదారులకు రూ.10కోట్ల విలువైన వాహనాలను లబ్ధిదారులకు అందజేశారు.
అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళితుల అభ్యున్నతికి 75 ఏండ్లుగా చేస్తున్న ప్రయత్నాలకు భిన్నంగా దళితుల జీవితాల్లో వెలుగులు నింపడంతో పాటు వారిలో ఆత్మగౌరవం పెంపొందించాలి అన్నదే కేసీఆర్ సంకల్పమన్నారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా లబ్ధిదారులకు నేరుగా లబ్ధి చేకూరేలా పథకాన్ని రూపొందించామన్నారు. కార్యక్రమంలో యాదాద్రి కలెక్టర్ పమేలా సత్పతి, నియోజకవర్గ టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం దళితబంధు లబ్ధిదారులతో కలిసి మంత్రి సహపంక్తి భోజనం చేశారు.