సూర్యాపేట : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు సంక్రాంతిని మరిపించేలా నిర్వహించాలని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి(Minister Jagadish Reddy )అధికారులను, ప్రజాప్రతినిధులను ఆదేశించారు. ఈ నెల 2 నుంచి నిర్వహించ నున్న దశాబ్ది ఉత్సావాల ఏర్పాట్ల పై గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో నియోజక వర్గ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్ది వేడుకలు(Decade Celebrations) శతాబ్ద కాలంగా ప్రజల మదిలో నిలిచి పోయేలా జరుపుతున్నామని అన్నారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని వెల్లడించారు. తొమ్మిది ఏళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్(Chief Minister KCR) నేతృత్వంలో జరిగిన పురోగతి వర్తమానానికి మార్గ దర్శనం అయ్యేలా ఉత్సవాలు ఉంటాయని పేర్కొన్నారు.
సంబరాలలో ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుకున్న లబ్దిదారులతో పాటు ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. సంక్రాంతి(Sankranti) ని మరిపించేలా రైతులు ఈ సంబరాల్లో పాల్గొనేలా చూడాలని కోరారు. కాళేశ్వరం(Kaleshwaram) జలాల తొలి ఫలం అందుకున్నది సూర్యాపేట జిల్లాయేనని వివరించారు. సూర్యాపేట నియోజక వర్గంలో త్రివేణి సంగమం ఏర్పడిందని అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సాధించిన ఘనత అని కొనియాడారు.
ఆధునిక దేవాలయలుగా రైతు వేదికలు వర్ధిల్లుతాయని ఆయన చెప్పారు. తలసరి ఆదాయంలో తెలంగాణా టాప్ అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్,జిల్లా కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ రాజేంద్ర ప్రసాద్, అడిషనల్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకట్ నారాయణ గౌడ్, గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ పెరుమాల అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్టా కిషోర్, ఎంపీపీ , జడ్పీటీసీలు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.