నల్లగొండ : నల్లగొండ ప్రజలకు అడుగడుగునా మోసం చేసిన కాంగ్రెస్ నాయకులు ముందుగా జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి(Minister Jagadish Reddy) డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన సూర్యాపేటలో మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకుల(Congress Leaders) కారణంగా నల్లగొండ జిల్లా వెనుకబాటుకు గురైందని ఆరోపించారు.
పాదయాత్ర పేరుతో ఆధిపత్యం కోసం తపన పడుతున్న సీఎల్పీ నేత మల్లు బట్టి విక్రమార్క((CLP Leader), కాంగ్రెస్ నేతలు సీఎం కేసీఆర్ను క్షమాపణలు కోరడం విడ్డూరంగా ఉందని అన్నారు. లక్షలాది మందిని పొట్టనబెట్టుకున్న ఫ్లోరైడ్ ను తొలగించినందుకు కేసీఆర్(CM KCR) క్షమాపణ చెప్పాలా? అని ప్రశ్నించారు. రాష్ట్రం లో, దేశంలో దరిద్రం ఉండడానికి కాంగ్రెస్సే కారణమని విమర్శించారు.
పదవుల కోసం ప్రజలకు ద్రోహం చేసింది మీరేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో సాగైన వ్యవసాయం, ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సాగు లెక్కలు తీద్దామా అంటూ కాంగ్రెస్ నాయకులకు సవాలు విసిరారు. సీనియర్ నేత జానారెడ్డి నియోజకవర్గంలో మొదటి మేజర్ రాజవరానికి ఇప్పుడే ఎందుకు నీళ్లు వస్తున్నాయి? ఇన్నాళ్లు ఎందుకు రాలేదు?.పదవుల కోసం పెదవులు మూసుకొని కూర్చున్నవారు ఇవ్వాళ మాట్లాడుతున్నారని విమర్శించారు.
తెలంగాణ కు అడుగడుగునా ద్రోహం చేసిన రాజశేఖర్ రెడ్డి ని ఎత్తుకోవడానికి సిగ్గుండాలని అన్నారు. సాగర్, మూసీ ప్రాజెక్ట్ ల కింద వరుసగా రెండు పంటలు వేస్తుంటే కనిపించడం లేదా? అంటూ నిలదీశారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. నల్గొండ జిల్లాలో రికార్డ్ స్థాయిలో ధాన్యం దిగుబడి వచ్చిందని అన్నారు.నరేంద్ర మోదీ దుర్మార్గాలు సహించలేక, ప్రత్యామ్నాయం లేక కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించారని పేర్కొన్నారు.