నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఏప్రిల్ 21: ప్రజా సంక్షేమం, అభివృద్ధే బీఆర్ఎస్ పార్టీ లక్ష్యమని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. పోరాడి సాధించుకున్న రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. శుక్రవారం నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలోని లోకేశ్వరంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి అల్లోల మాట్లాడుతూ.. పక్క రాష్ట్రమైన మహారాష్ట్ర ప్రజలు కూడా సీఎం కేసీఆర్ పాలనను స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎంత అభివృద్ధి జరిగిందో ఆధారాలతో చూపించాలని డిమాండ్ చేశారు. ఈ సమ్మేళనంలో ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కార్మికులందరినీ సంఘటితం చేయాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. మహబూబ్నగర్లో బీఆర్ఎస్కేవీ అధ్యక్షుడు కృష్ణమోహ న్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్మిక సంఘాల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడారు. కార్మిక సంఘాలకు అండగా ఉంటామని భరోసా కల్పించా రు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి పాలకులు కార్మికులను పట్టించుకోలేదని, తెలంగాణ ఏర్పడ్డాక వారికి మంచిరోజులు వచ్చాయని తెలిపారు. వివిధ రం గాల కార్మికులకు వేతనాలు పెంచినట్టు చెప్పారు.
ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టి వచ్చే ఎన్నికల్లో విజ యం సాధించాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రామానుజవరంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. స్వార్థపూరిత రాజకీయాలు చేసే వారితో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి కేసీఆర్ను మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదన్నారు.