కేంద్ర పథకాల పేర్లు మార్చి ప్రచారం చేసుకుంటున్నారని తెలంగాణపై కేంద్రం మంత్రి నిర్మలాసీతారామన్ అసత్యాలు మాట్లాడారని మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ఏయే పథకం మార్చామో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రైతు బంధును కేంద్రం కాపీకొట్టిందన్నారు. కిసాన్ సమ్మాన్ నిధి అని పేరు మార్చుకున్నారని ఎద్దేవా చేశారు. మెదక్జిల్లా తూఫ్రాన్లో శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రైతు బంధు కేంద్రం పెట్టిందా..రాష్ట్రం పెట్టిందా? అని నిర్మలా సీతారామన్ను ప్రశ్నించారు. ప్రతీ రైతుకు…ప్రతీ ఎకరానికి రూ. పది వేలు రూపాయలు ఇస్తున్నామన్నారు. ఇందులో పైసా అయినా కేంద్రానిది ఉందా? అని ప్రశ్నించారు. రైతుబంధు కేసీఆర్ గుండెల్లోంచి పుట్టిందన్నారు. అలాగే, రైతు బీమాలో మీది ఒక్క రూపాయన్నా ఉందా? అని ప్రశ్నించారు. 24 గంటల ఉచిత కరెంటును కాపీ కొట్టామా? అని ప్రశ్నించారు. ఏ బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతుకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నారో నిర్మలాసీతారామన్ చెప్పాలన్నారు. బాన్సువాడలో తిరుగుతున్న నిర్మలా సీతారామన్.. అక్కడి రైతును అడగండి.. రైతు బందు, రైతు బీమా, ఉచిత కరెంటు ఎలావస్తుందో చెబుతారన్నారు.
దేశమంతటా తెలంగాణ పథకాలు ఇవ్వండి..
కేంద్ర మంత్రిగా రేపటి బడ్జెట్లో దేశమంతటా రైతులకు 24 గంటల ఉచితవిద్యుత్ ఇవ్వాలని నిర్మలాసీతారామన్ను మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. తెలంగాణలాగా దేశంలోని ప్రతి రైతుకూ రైతు బంధు, రైతు బీమా ఇవ్వాలన్నారు. తెలంగాణ సర్కారు ఏ కేంద్ర పథకాన్ని కాపీ కొట్టిందో నిర్మలాసీతారామన్ ప్రజలకు వివరించాలని డిమాండ్ చేవారు. ఆసరా పెన్షన్, షాదీ ముబారక్, కల్యాణలక్ష్మీ ఇందులో కేంద్రానికి ఒక్క రూపాయన్నా ఉందా? అని ప్రశ్నించారు. ‘కేసీఆర్ కిట్ లో మీ భాగస్వామ్యం ఉందా? ఎందుకు మీ స్థాయి తగ్గించుకుంటున్నరు’ అని నిర్మలాసీతారామన్ను ప్రశ్నించారు. రైతు బంధును మీరు సగం కాపీ కొట్టి ఎకరానికి ఆరువేలు.. అదీ కొందరికే ఇస్తున్నరని తెలిపారు. ప్రధాని గజ్వేల్లో స్వయానా నల్లా తిప్పి మిషన్ భగీరథను ప్రారంభించారని, దాన్ని కేంద్రం కాపీకొట్టి ‘హర్ ఘర్ కో జల్’ అని మార్చేసిందన్నారు.
అర్థ సత్యాలు. అవాస్తవాలు..
పచ్చి అబద్ధాలు , ఇంత దారుణంగా దివాలా కోరు దిక్కుమాలిన రాజకీయాలు ,దిగజారుడు రాజకీయాలు పట్టపగలు పచ్చి అబద్దాలు పచ్చి అబద్దాలు మాట్లాడిన టువంటి పార్టీ బిజెపి పార్టీ కేంద్ర మంత్రి సీతారామన్ గారు
-హరిషన్న 🔥🔥🔥🔥🔥@trsharish@akubathini2 pic.twitter.com/etPPkfEN8R
— Khushe💕sammu (@Khushe83059819) September 2, 2022
బీజేపీ మంత్రులు అర్ధ సత్యాలు, అవాస్తవాలు మాట్లాడుతున్నారని మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. మన ఊరు- మన బడి కార్యక్రమం కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్వహిస్తున్నట్టు చెప్పుకుంటున్నదన్నారు. ఇంత పచ్చి అబద్జాలు మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. ఇవాళ తెలంగాణ సర్ ప్లస్ నుంచి డెఫిసిట్ కు పోయిందని చెబుతున్నారని, మరి ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ ఎందుకు రూ. 22 వేల 548 కోట్లు లోటులో ఉందని ప్రశ్నించారు. తెలంగాణలో ఫసల్ బీమా అమలుకావడం లేదని చెబుతున్న నిర్మలాసీతారామన్..ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్లో ఎందుకు అమలు కావడం లేదో సమాధానం చెప్పాలన్నారు. తాను నిర్మలాసీతారామన్ అడిగిన ప్రతి ప్రశ్నకూ సమాధానమిచ్చానని, తాను అడిగిన ప్రశ్నలకు సమాధానమివ్వాలని నిర్మలాసీతారామన్ను డిమాండ్ చేశారు.